తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కాటుకు భార్యాభర్తలు మృతి - wife and husband died of corona news

కరోనా మహమ్మారి భార్యాభర్తలను బలి తీసుకుంది. దంపతుల మృతితో వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

wife and husband died of corona
కరోనాతో భార్యాభర్తలు మృతి

By

Published : Apr 30, 2021, 12:10 PM IST

అన్యోన్యంగా ఉండే వారి కుటుంబంలో కరోనా మహమ్మారి తీరని విషాదాన్ని మిగిల్చింది. నాలుగు రోజుల వ్యవధిలోనే వైరస్​ కాటుకు బలయ్యారు. దీంతో వారి ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం శ్రీ రంగాపూర్​ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన సాయి ప్రకాష్​రావు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో స్కూల్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్నారు. పది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్​లోని ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఈ నెల 25న మృతి చెందారు. ప్రకాష్​ అనారోగ్యంగా ఉన్పప్పడు సపర్యలు చేసిన ఆయన భార్య ఉమారాణి కూడా కొవిడ్​ బారిన పడటంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. వారిద్దరి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో 77 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు

ABOUT THE AUTHOR

...view details