రైతు వేదికలను అక్టోబరు 10 నాటికి పూర్తిచేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష స్పష్టం చేశారు. పానుగల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను పాలనాధికారి తనిఖీ చేశారు.
సాంకేతిక పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు నత్తనడకన సాగడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.