తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2020, 7:56 PM IST

Updated : Mar 6, 2020, 9:28 PM IST

ETV Bharat / state

'కీచక టీచర్​ని ఉరి తీయండి'

అభం శుభం తెలియని చిన్నారులపై అఘాత్యానికి పాల్పడిన ప్రైవేటు ఉపాధ్యాయుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్​ చేస్తూ గోపాల్​పేటలో విద్యార్థులు ధర్నాకు దిగారు.

wanaparthy
'కీచక టీచర్​ని ఉరి తీయండి'

వనపర్తిలో కోచింగ్ పేరుతో అభం శుభం తెలియని చిన్నారులపై అఘాత్యాలకు పాల్పడిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు శరత్​ను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం గోపాలపేట మండలం ఎదుట్లలో విద్యార్థులు ధర్నాకు దిగారు. విచారణ పేరుతో సంవత్సరాలుగా అతడిని మేపొద్దని... తక్షణమే విచారణ జరిపి ఉరితీయాలని డిమాండ్ చేశారు.

ధర్నాలో విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆందోళన విరమించేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా వారు పట్టువిడవలేదు. అనంతరం వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ అక్కడికి చేరుకొని గ్రామస్థులతో చర్చలు జరిపి... త్వరలోనే అతనిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వగా వారు ఆందోళన విరమించారు.

'కీచక టీచర్​ని ఉరి తీయండి'

ఇవీ చూడండి:నస్పూర్​లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం

Last Updated : Mar 6, 2020, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details