వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి శివారులో వ్యవసాయ పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శ్వేతా మహంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో అధికారులు నమోదు చేసిన దస్త్రాలను పరిశీలించారు. దస్త్రాలలో పూర్తి వివరాలు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యం వివరాలను... కొనుగోలు కేంద్రం నుంచి అధికారులకు పంపించే ప్రతి బస్తా వివరాలను నమోదు చేయాలని వారికి సూచించారు.