వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగపేట గ్రామ శివారులో ఓ గొర్రెల కాపరి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి కాపరితోపాటు మూడు గొర్రెలు మరణించాయి.
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి - వనపర్తి జిల్లా తాజా వార్త
వనపర్తి జిల్లా సింగపేట గ్రామశివారులో పిడుగుపాటుకు ఓ గొర్రెలకాపరితో పాటుగా మూడు గొర్రెలు మరణించాయి.
![పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి Shepherd dead by the thunderstorm in wanaparthy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7428263-257-7428263-1591009682709.jpg)
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
మృతుడు కొంకన్నోని పల్లె గ్రామానికి చెందిన కుర్వ చిన్న అంజలన్నగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పంచనామా చేశారు.
ఇదీ చూడండి:భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా