తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2021, 2:07 PM IST

ETV Bharat / state

పర్వతారోహణలోనూ పట్టు సాధించిన పోలీసులు..!

వనపర్తి జిల్లాలోని పోలీసులకు పర్వతారోహణ కార్యక్రమం నిర్వహించారు. తాడు సాయంతో గుట్టపైకి ఎక్కడం, దిగడం వంటివి చేయించారు. ఈ కార్యక్రమాల్లోనూ పోలీసులు సత్తా చాటారు. వీటివల్ల మనోధైర్యం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

police-mountaineering-successful-in-wanaparthy-district
పర్వతారోహణలోనూ పట్టు సాధించిన పోలీసులు!

పర్వతారోహణలోనూ పట్టు సాధించిన పోలీసులు!

విధి నిర్వహణలోనే కాకుండా పర్వతారోహణ కార్యక్రమంలోనూ వనపర్తి జిల్లా పోలీసులు తమ సత్తా నిరూపించారు. తెలంగాణ పర్వతారోహణ సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పరిధిలో నూతనంగా విధులు చేపట్టిన 45 మంది పోలీసులకు దానిపై శిక్షణ ఇప్పించారు.

జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, పానగల్, ఖిల్లా ఘణపురం, పెద్దమందడి, గోపాల్‌పేట, రేవల్లి, కొత్తకోట పోలీస్ స్టేషన్ల పరిధిలోని 15 మంది మహిళా పోలీసులతో పాటు 30 మంది పోలీసులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని తిరుమలయ్య గుట్టపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాడు సాయంతో కొండల పైకి ఎక్కడం, దిగడం, దూకడం వంటివి చేయించారు. ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యలను ఎదుర్కొనే మనోధైర్యం ఈ పర్వతారోహణ కార్యక్రమాల ద్వారా అలవడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

"గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు మనోధైర్యం కల్పించేందుకు మా స్వచ్ఛంద సంస్థ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇప్పటికీ చాలా శిక్షణలు ఇచ్చాం. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ వ్యక్తిగత మనోధైర్యం ఏర్పడుతుంది. ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించవచ్చు."

-రాజేందర్, తెలంగాణ పర్వతారోహణ క్లబ్ ముఖ్య కార్యనిర్వాహకులు

ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్‌తో పాటు పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రాం ఫిలింజిప్, లైన్ జామర్ కార్యక్రమాలపై పోలీసులకు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి:ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి.!

ABOUT THE AUTHOR

...view details