తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​పై వనపర్తి జిల్లా యంత్రాంగం యుద్ధం

ప్లాస్టిక్​ నిషేధించడమే లక్ష్యంగా వనపర్తి జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ప్లాస్టిక్​ వాడకం వల్ల భవిష్యత్​లో వచ్చే అనర్థాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల చేత కాగితం సంచులు తయారు చేయిస్తున్నారు.

By

Published : Aug 16, 2019, 4:46 PM IST

దుకాణా దారులకు కాగితం సంచులు అందిస్తున్న అధికారులు

ప్లాస్టిక్​పై వనపర్తి జిల్లా యంత్రాంగం యుద్ధం

వనపర్తి జిల్లా అధికార యంత్రాంగం ప్లాస్టిక్​పై యుద్ధం ప్రకటించింది. ప్లాస్టిక్​ వాడొద్దంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రతీ మండలంలోని రెండు గ్రామాలను దత్తత తీసుకుని ఆయా గ్రామాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ గ్రామంలోని పరిసరాలలో ప్లాస్టిక్ లేకుండా ఏరివేత కార్యక్రమం చేపట్టారు.

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పట్టణ, గ్రామాల్లోని హోటళ్లు, కిరాణా దుకాణాలు, మాంసం విక్రయ కేంద్రాల్లో ప్లాస్టిక్​ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. కాగితపు సంచులు, వస్త్రపు సంచులను వాడుకోవాలని సూచిస్తున్నారు. కాగితపు సంచులు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునేలా పలు శిక్షణ కార్యక్రమాలను ఉచితంగా ఇస్తున్నారు. 190 పాఠశాలల్లో ప్రతీ స్కూల్​ నుంచి 1000 కాగితపు సంచులు తయారీ చేయించి.. వ్యాపారస్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.

కాగితపు సంచులు

పాఠశాలలోని ఒక్కో విద్యార్థి గంట సమయంలో ఏడు కాగితపు సంచులు తయారు చేస్తారని జిల్లా విద్యాధికారి సుశీంద్ర రావు తెలిపారు. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ వాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానాలు విధించనున్నట్లు చెప్పారు.కాగితపు సంచులు తయారు చేస్తున్న విద్యార్థులు తమ ఇంట్లో ప్లాస్టిక్ కవర్లను వాడకుండా చూస్తున్నామన్నారు. కాగితపు సంచులు తయారు చేసి తల్లిదండ్రులకు అందిస్తున్నామమని చెప్పారు. మహిళా సంఘాలకు కాగితపు సంచులు, వస్త్రపు సంచులు తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారితో సంచులను తయారు చేయిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

ఇవీ చూడండి:గవర్నర్​ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details