వనపర్తి జిల్లా వ్యాప్తంగా 120 కొనుగోలు కేంద్రాలు
ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తెలిపారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా 120 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రానున్న కాలంలో పంట మార్పిడిపై రైతులు దృష్టి సారించాలని నిరంజన్ రెడ్డి సూచించారు.