భార్య బాలింతగా ఉన్న సమయంలో పోషకాహారానికి సంబంధించి భర్తే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీడీపీఓ లక్ష్మమ్మ అన్నారు. పోషణ పక్షోత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లాలోని కొత్తకోట, మదనాపురం మండలాల అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన చేపట్టారు. కుటుంబంలోని పిల్లల పోషణ, భార్య, ఇతర కుటుంబ సభ్యుల విషయంలో భర్త చేదోడువాదోడుగా ఉండాలని సూచించారు. అప్పుడే ఆ కుటుంబంలోని వారంతా సరైన పోషకాహారం అంది ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
భార్య పోషకాహారానికి భర్తే చేదోడువాదోడుగా నిలవాలి - 'భార్యకు పోషకాహారం అందేలా చూడాల్సింది భర్తే'
వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భార్యకు పోషకాహారం అందించేలా భార్తే చూసుకోవాలని సీడీపీఓ లక్ష్మమ్మ అన్నారు.
![భార్య పోషకాహారానికి భర్తే చేదోడువాదోడుగా నిలవాలి 'భార్యకు పోషకాహారం అందేలా చూడాల్సింది భర్తే'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6385614-thumbnail-3x2-bhartha.jpg)
'భార్యకు పోషకాహారం అందేలా చూడాల్సింది భర్తే'
ప్రతి అంగన్వాడీ టీచర్.. గ్రామంలోని గర్భిణీ, బాలింతలు కేంద్రానికి వచ్చి భోజనం చేసేలా కృషి చేయాలన్నారు. చిన్నారులకు, కిశోర బాలికలకు గుడ్లు, బాల అమృతాన్ని పౌష్టికాహారంగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పోషణ కో-ఆర్డినేటర్ వనజా కుమారి, శేఖర్, సూపర్వైజర్ భారతి, ఉమ్మడి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
'భార్యకు పోషకాహారం అందేలా చూడాల్సింది భర్తే'
ఇవీ చూడండి : 'వ్యవసాయ అంశాలపై హరీశ్రావు చెప్పేవన్నీ అసత్యాలే'
Last Updated : Mar 13, 2020, 11:46 AM IST
TAGGED:
POSHANA AVAGAHANA