తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్మీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు - ఆర్మీ జవాన్ సంతాప సభలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

అనారోగ్యంతో మృతి చెందిన ఆర్మీ జవాన్ క్రాంతి కుమార్ కుటుంబాన్ని రాష్ట్రమంత్రి హరీశ్ రావు పరామర్శించారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో జరిగిన సంతాప సభలో ఆయనకు నివాళులర్పించారు.

Harish Rao visiting the family of an Army Jawan  kranthi  kuma
ఆర్మీ జవాన్​కు నివాళులర్పిస్తున్న మంత్రి హరీశ్ రావు

By

Published : Apr 10, 2021, 3:35 PM IST

రాష్ట్ర జానపద కళాకారుడైన సాయిచంద్ సోదరుడు, ఆర్మీ జవాన్ క్రాంతికుమార్​కు మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. ఆర్మీలో పనిచేసి నాలుగు సంవత్సరాల క్రితమే రిటైర్ అయినా క్రాంతి కుమార్ అనారోగ్యంతో ఇటీవలే మరణించాడు.

వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో జరిగిన సంతాపసభలో వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. పది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో ఆర్మీ జవాన్ క్రాంతి కుమార్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తాటి చెట్టు నుంచి కల్లును దించి.. మొక్కులు చెల్లించి..

ABOUT THE AUTHOR

...view details