తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2021, 9:16 AM IST

ETV Bharat / state

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలి: సీఎస్​

కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సీఎస్​ సోమేశ్​ కుమార్​ ఆదేశించారు. ఉపాధి హామీ పథకాన్ని అన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేయాలని చెప్పారు. పలు అభివృద్ధి పనులపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన సీఎస్​.. వారికి పలు సూచనలు చేశారు. ఈ దూరదృశ్య మాధ్యమ సమావేశంలో వనపర్తి జిల్లా కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ బాష పాల్గొన్నారు.

cs somesh kumar, wanaparthy collectors
వనపర్తి కలెక్టర్​తో సీఎస్​ సమావేశం

యాసంగిలో ధాన్యం సేకరణ, కొనుగోళ్లకు సిద్ధం కావల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్​ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈమేరకు మంగళవారం.. కల్లెక్టర్లతో సీఎస్​ దూరదృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ యాసంగిలో కూడా ధాన్యం విరివిగా మార్కెట్​కు వచ్చే అవకాశముందని సోమేశ్​ కుమార్​ తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసిందిగా ఆయన సూచించారు. ఈ దూరదృశ్య మాధ్యమ సమావేశంలో వనపర్తి జిల్లా కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ బాష పాల్గొన్నారు.

దూరదృశ్య మాధ్యమంలో పాల్గొన్న కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ బాష, అధికారులు

నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ

ఉపాధి హామీ పథకం కింద వనపర్తి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో 100 రోజుల పని చేపట్టాలని సీఎస్​ చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో చేపట్టిన వైకుంఠధామాలు, రైతు వేదికలు, రైతు కల్లాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్​ను ఆదేశించారు. హరిత హారంలో భాగంగా నర్సరీల లక్ష్యాలను సాధించాలని.. ఈ రెండు మాసాలు నర్సరీల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

పచ్చదనంతో రహదారులు..

జిల్లా కేంద్రంలో రహదారుల వెంట మూడు వరసల్లో పెద్ద పెద్ద మొక్కలు నాటాలని సీఎస్​ అన్నారు. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్​ల ఏర్పాటుకు చొరవ చూపాలని చెప్పారు. కొవిడ్ నిబంధనలకు సంబంధించి జారీ చేసిన 68, 69 జీఓలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని కల్లెక్టర్లకు సూచించారు. ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ షేక్ యస్మీన్ బాష సీఎస్​కు తెలిపారు.

ఇదీ చదవండి:మూసీపై దృష్టి పెట్టి.. సాగర్‌ను వదిలిపెట్టి..

ABOUT THE AUTHOR

...view details