తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2020, 1:16 PM IST

ETV Bharat / state

వనపర్తి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

వనపర్తి జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన బాధితుల ప్రైమరీ కాంటాక్ట్​లను గుర్తించి వారిని హోమ్​ క్వారంటైన్​ చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

corona cases in wanaparthy district
వనపర్తిలో  పెరుగుతున్న కరోనా కేసులు

వనపర్తి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జిల్లా పరిధిలో తొమ్మిది కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన కేసుల్లో వనపర్తి పట్టణంలో మూడు కేసులు, కొత్తకోటలో మూడు, పెద్దమందడి మండలం మద్దిగట్లలో ఒకటి, ఖిల్లా ఘనపురంలో రెండు కేసులు నమోదయ్యాయి.

కొత్త కేసులతో వనపర్తి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 39కి చేరాయి. ఒకరు డిశ్చార్జి కాగా.. 36 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం నమోదైన కరోనా బాధితుల ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారిని హోమ్ క్వారంటైన్​ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details