ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులు తమ తమ డిపోలకు తరలివస్తున్నారు. అమరులైన కార్మికులకు నివాళులు అర్పించి... విధుల్లో చేరుతున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డిపో వద్ద కార్మికుల సందడి నెలకొంది. అధికారులు వారిని విధులకు అనుమతించడంతో ఉదయం నుంచే బస్సులు రోడ్లపైకి వచ్చాయి.
ఎలాంటి షరతులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తమను విధులకు అనుమతించడం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీకి వంద కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
పరిగిలోనూ...