తెలంగాణ

telangana

By

Published : May 16, 2021, 4:23 PM IST

ETV Bharat / state

కరోనా బాధితుల హార్ట్ బీట్, పల్స్ రేట్​ పరిశీలించిన ఎమ్మెల్యే

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కరోనా ఐసోలేషన్ వార్డులను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సందర్శించారు. చికిత్స పొందుతున్న కొవిడ్​ బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి హార్ట్ బీట్, పల్స్ రేట్​ను పరిశీలించారు.

mla Methuku Anand, Vikarabad district news
mla Methuku Anand, Vikarabad district news

అధైర్య పడకుండా సరైన సమయంలో చికిత్స తీసుకుంటే కరోనాను జయించవచ్చని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి డెంటల్ కాలేజ్​లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్, మహావీర్ ఐసోలేషన్ వార్డులను ఎమ్మెల్యే సందర్శించారు.

స్వయంగా డాక్టర్ అయిన ఎమ్మెల్యే.. చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి హార్ట్ బీట్, పల్స్ రేట్​ను పరిశీలించారు. అదే వార్డులో చికిత్స పొందుతున్న ఓ పత్రికా విలేకరితో మాట్లాడారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అందరూ రెండు మాస్కులు ధరించాలని సుచించారు.

ఇదీ చూడండి:అకాల వర్షానికి తడిసిముద్దయిన ధాన్యం

ABOUT THE AUTHOR

...view details