వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నార్మూల్ పాల ఉత్పత్తి పదార్థాల కేంద్రాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నాయకోట్ వాడలో పార్టీ నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని కాలనీ వాసులతో సభ్యత్వ నమోదు చేయించారు. పార్టీ కార్యకర్తలే తెరాసకు అండ దండ అని వారి వారి సహకారంతో కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని రంజిత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాకర్షణ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఎంతోమంది పార్టీలో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.
పరిగిలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
తెరాస పార్టీ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పరిగిలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం