బండ వెల్కిచర్లలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు - బండ వెల్కిచర్లలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు
నేడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా బండ వెల్కిచర్ల గ్రామంలో జయంతి ఉత్సవాలు జరిగాయి. సమావేశానికి ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, విద్యార్థులు హాజరయ్యారు.
![బండ వెల్కిచర్లలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు బండ వెల్కిచర్లలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5582997-352-5582997-1578053443295.jpg)
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండ వెల్కిచర్ల గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక న్యూ రవీంద్ర భారతి పాఠశాలలో జరిగిన ఈ ఉత్సవానికి గ్రామ సర్పంచ్ శిరీష లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి సమాజంలో మహిళల విద్య పట్ల వ్యతిరేకత ఉన్నంతకాలంలోనే మహిళలు పురుషులతో సమానంగా ఉండాలని పోరాడినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. సావిత్రిబాయి పూలే కేవలం స్త్రీ విద్యకే పరిమితం కాలేదని.. అనారోగ్యంతో ఉన్న వారికీ చికిత్స చేసిందని ఆమె తెలిపారు.