తెలంగాణ

telangana

ETV Bharat / state

వికారాబాద్​లో సఖి కేంద్రం ప్రారంభం - mp ranjith reddy on sakhi centers

వికారాబాద్​లో సఖి కేంద్రాన్ని ఎంపీ రంజిత్​రెడ్డి, జడ్పీ ఛైర్​పర్సన్​ సునీతా మహేందర్​రెడ్డి, కలెక్టర్​ అయేషా, ఎస్పీ నారాయణ, ఎమ్మెల్యే ఆనంద్​తో కలిసి​ ప్రారంభించారు.

వికారాబాద్​లో సఖీ కేంద్రం ప్రారంభం

By

Published : Oct 29, 2019, 9:41 PM IST

వికారాబాద్​ జిల్లా కేంద్రంలో సఖి కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆనంద్​తో కలిసి ఎంపీ రంజిత్​రెడ్డి, జడ్పీ ఛైర్​పర్సన్​ సునీతా మహేందర్​రెడ్డి ప్రారంభించారు. మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని ఎంపీ అన్నారు. మహిళలకు అవగాహన పెరిగిందని.. గృహహింస వంటి ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్​ నుంచి నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అయినా సఖి కేంద్రాలు విజయవంతం కావాలని తాను కోరుకోవడం లేదని ఎంపీ స్పష్టం చేశారు. మహిళలకు ఎటువంటి సమస్యలున్నా సఖి కేంద్రాల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని జడ్పీ ఛైర్​పర్సన్​ అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ అయేషా, ఎస్పీ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వికారాబాద్​లో సఖీ కేంద్రం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details