తెలంగాణ

telangana

By

Published : Mar 16, 2021, 10:35 PM IST

ETV Bharat / state

'తాండూర్​ పట్టణ శివారులోని ఆర్​యూబీని తెరవాలి'

తాండూర్​ పట్టణ శివారు ప్రాంతంలో ఇటీవల మూసివేసిన రైల్వే అండర్ బ్రిడ్జిని తెరవాలని కేంద్రప్రభుత్వాన్ని తెరాస ఎంపీ రంజిత్​రెడ్డి కోరారు. లోక్​సభలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

mp ranjith reddy request to central for RUB should be opened in Tandur
'తాండూర్​ పట్టణ శివారులోని ఆర్​యూబీని తెరవాలి'

వికారాబాద్​ జిల్లా తాండూర్ పట్టణ శివారు ప్రాంతంలో మూసివేసిన రైల్వే అండర్ బ్రిడ్జిని తెరవాలని తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్​సభలో రైల్వే బడ్జెట్​పై చర్చ జరుగుతున్న సందర్భంలో ఎంపీ జోక్యం చేసుకొని ఆర్​యూబీ రోడ్డును తెరవాలని విజ్ఞప్తి చేశారు.

స్థానిక రైల్వే అధికారులు ఇటీవల ఆర్​యూబీ మార్గం మూసివేయడంతో పశువులు, జీవాలను మేపుకునే వారు దాదాపు 5 కిలోమీటర్లు అదనపు దూరం వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఎంపీ దృష్టికి గతంలో తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే మూసివేసిన బ్రిడ్జిని తిరిగి తెరావాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:టేక్రియాల్ కేజీబీవీలో కరోనా కలకలం... 32 మందికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details