తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2020, 11:17 PM IST

ETV Bharat / state

'ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'

ప్రజల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పరిగి ఎమ్మెల్యే మహేష్​ రెడ్డి అన్నారు. వికారాబాద్​ జిల్లా పోల్కంపల్లి గ్రామంలో పల్లెప్రకృతి వనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.

MLA mahesh reddy toured Parigi constituency
'ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'

వికారాబాద్ జిల్లా పరిగి మండలం పోల్కంపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన పల్లె పకృతి వనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహేష్​ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం రాఘవపూర్ గ్రామంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా ఉచిత చేప పిల్లలను చెరువులో వదిలారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details