వికారాబాద్ జిల్లా పరిగిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రేమ్నగర్ కాలనీలో రాత్రి బస చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ మోతీలాల్, ప్రభుత్వ అధికారులు, వివిధ ప్రజా ప్రతినిధులతో కలిసి వార్డుల్లో తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రేమ్నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు, వీధిలైట్లను ప్రారంభించారు. అందరి సమన్వయంతో పరిగి మున్సిపాలిటీని ఆరోగ్య మున్సిపాలిటీగా మార్చుతామని ఎమ్మెల్యే అన్నారు.
మహిళా కౌన్సిలర్లు ఇంట్లో.. భర్తలు అధికారిక కార్యక్రమాల్లో... - vikarabad district news today
పరిగిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రేమ్నగర్ కాలనీలో రాత్రి బస చేశారు. పలువురు అధికారులతో కలిసి వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా కౌన్సిలర్లకు బదులుగా వారి భర్తలు హాజరయ్యారు.
![మహిళా కౌన్సిలర్లు ఇంట్లో.. భర్తలు అధికారిక కార్యక్రమాల్లో... mla mahesh reddy spent the night in the colony at pargi vikarabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6187051-291-6187051-1582544136000.jpg)
వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రేమ్నగర్ కాలనీలో 1, 13, 14, 15 వార్డులకు సంబంధించి మహిళా కౌన్సిలర్లకు బదులుగా వారి భర్తలు హాజరయ్యారు. 8వ వార్డు కౌన్సిలర్కు బదులుగా వారి కుమారుడు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరగా కౌన్సిలర్లందరికి సమాచారం ఇచ్చామన్నారు. కౌన్సిలర్లు మాత్రమే రావాలని సూచించినా వాళ్లు పట్టించుకోవడం లేదని వివరణ ఇచ్చారు.
వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
ఇదీ చూడండి :ఏం చేశారని నిలదీసిన స్థానికుడు... కోపానికొచ్చిన మంత్రి