తెలంగాణ

telangana

By

Published : May 27, 2020, 6:32 PM IST

ETV Bharat / state

రైతులతో ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి రైతులు ఆర్థికంగా ఎదగాలని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే పరిగిలో ఆయన రైతు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

mla mahesh reddy conducted farmer wareness program
రైతులతో ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని మల్కాపూర్​లో రైతు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి హాజరయ్యారు. నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.

రైతులు గిట్టుబాటు అయ్యే పంటలు పండించి ఆర్థికంగా ఎదిగేందుకే... ప్రభుత్వం నియంత్రిత పంట సాగు విధానం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలే పండిస్తామని అన్నదాతలతో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు.

ఇవీ చూడండి:కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details