తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్​ తరగతుల తీరుతెన్నులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్​ - ఎమ్మెల్యే ఆనంద్​ తాజా వార్తలు

విద్యార్థులు ఆన్​లైన్​ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్​ పేర్కొన్నారు. వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని శివరాం నగర్​ కాలనీలోని ఓ విద్యార్థిని ఇంట్లో ఆన్​లైన్​ తరగతుల తీరుతెన్నులను పరిశీలించారు.

MLA Anand examines the progress of online classes
ఆన్​లైన్​ తరగతుల తీరుతెన్నులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్​

By

Published : Sep 1, 2020, 1:55 PM IST

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ఆన్​లైన్​ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని శివరాం నగర్ కాలనీలో ఎమ్మెల్యే ఆనంద్​ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ విద్యార్థిని ఇంటికెళ్లి ఆన్​లైన్​ తరగతులను పరిశీలించారు.

సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న రక్షిత అనే విద్యార్థిని ఇంట్లోకి వెళ్లి.. ఆన్​లైన్​ క్లాసుల తీరుతెన్నులను పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థినికి పలు సూచనలు చేశారు. నేరుగా వినే తరగతులకు, ఆన్​లైన్ తరగతులకు వ్యత్యాసం ఉన్నా.. శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. ఏవైనా అనుమానాలుంటే ఉపాధ్యాయులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు.

విద్యార్థినికి పలు సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే

ఇదీచూడండి.. వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్​ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్​కే..

ABOUT THE AUTHOR

...view details