వికారాబాద్లో సబితా ఆనంద్ హాస్పిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ దంపతులు సన్మానించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.
వారందరి సేవలు వెలకట్టలేనివి: ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ - వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యులు దేవుళ్లు అయ్యారని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. ప్రాణాలకు తెగించి కరోనాతో వారు యుద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.
![వారందరి సేవలు వెలకట్టలేనివి: ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ vikarabad district latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7319403-1023-7319403-1590238089839.jpg)
vikarabad district latest news
కరోనా నివారణకు వీరు చేసిన కృషి చాలా గొప్పదన్నారు ఎమ్మెల్యే ఆనంద్. కరోనా రోగులను గుర్తిచడంలో ఆశా వర్కర్లు కృషి చేశారని పేర్కొన్నారు. కరోనా విస్తరించకుండా పారిశుద్ధ్య కార్మికులకు నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు.