కుల్కచర్లలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గీత కార్మికులు
వికారాబాద్ జిల్లాలో గీత కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గీత కార్మికులు
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గీత కార్మికులు
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని గీత కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో గీత కార్మికులకు జీవనోపాధిగా నీరా విధానాన్ని తీసుకొస్తున్నట్లు అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారని తెలిపారు. నిరుపేద గీత కార్మికుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన తెలిపారు. ఈ విషయంపై గీత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ... కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.