తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిగిలో జర్నలిస్టుల కొవ్వొత్తుల ర్యాలీ - జర్నలిస్టుల కొవ్వొత్తుల ర్యాలీ

కరోనాతో మరణించిన జర్నలిస్ట్ ఆత్మకు శాంతి చేకూరాలని వికారాబాద్ జిల్లా పరిగిలో జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ఫొటోకు నివాళులర్పించారు.

journalists protest
పరిగిలో జర్నలిస్టుల కొవ్వొత్తుల ర్యాలీ

By

Published : Jun 10, 2020, 11:03 AM IST

వికారాబాద్ జిల్లా పరిగిలోని అమరవీరుల చౌరాస్తాలో జర్నలిస్టులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కరోనాతో మరణించిన జర్నలిస్ట్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. కరోనా కట్టడిలో జర్నలిస్ట్ పాత్ర చాలా గొప్పదని... ప్రభుత్వం బాధితుని కుటుంబానికి 50 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని జర్నలిస్ట్​లు డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఉన్న ప్రతి జర్నలిస్ట్​కు ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఖర్చుతో 50 లక్షల బీమా చేయించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

ABOUT THE AUTHOR

...view details