తెలంగాణ

telangana

స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక భరోసా: మంత్రి సబిత

By

Published : Mar 21, 2021, 7:48 PM IST

వికారాబాద్‌ జిల్లా పరిగిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సత్కరించారు.

International Women's Day celebrations in parigi
పరిగిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో పూడూర్ జడ్పీటీసీ మల్లిపెద్ది మేఘమాల ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సత్కరించారు.

రాజకీయంలోనూ..

స్వయం ఉపాధితో ఎంతో మంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని సబిత అన్నారు. రాజకీయంలోను కీలక పాత్రలు పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఒంటరి మహిళలకు ప్రభుత్వం.. పింఛన్లు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, టూరిజం శాఖ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా, మహిళా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు

ఇదీ చదవండి:'న్యాయవాద దంపతుల కుటుంబానికి రూ. 5 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి'

ABOUT THE AUTHOR

...view details