తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల - tirumala latest news

తిరుమల దేవస్థానంలో భక్తులు బారులు తీరారు. కరోనా తరువాత తిరుగిరులు వేలాది మంది భక్తులతో కిటకిటలాడాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ 50,200 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సురేశ్‌ ప్రభు శ్రీవారిని దర్శించుకున్నారు.

ttd
ttd

By

Published : Feb 7, 2021, 1:12 PM IST

కరోనా కారణంగా.. దాదాపు ఏడాది తరువాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించిన తితిదే.. వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండటంతో దశలవారీగా టోకెన్లను పెంచుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ 50,200 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 25,621 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3 కోట్ల 11 లక్షల ఆదాయం వచ్చింది. ఆదివారమూ ఇదే రద్దీ కొనసాగే అవకాశముంది.

వీఐపీ దర్శన సమయంలో..

ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సురేశ్‌ ప్రభు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్న అనంతరం.. తీర్థప్రసాదాలు అందుకున్నారు.

ఇదీ చదవండి:నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం... 'సీఎంగా కేటీఆర్​'పై స్పష్టత!

ABOUT THE AUTHOR

...view details