వికారాబాద్ జిల్లా పరిగి డీసీఎంస్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ వద్ద మక్కలు కొనుగోలు చేయకుండా.. దళారుల వద్ద తీసుకుంటున్నారని రైతులు మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రం సిబ్బందితో వాగ్వాదానికి దిగి కొనుగోలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేవరకు కదిలేది లేదని మొండికేశారు.