తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2020, 11:12 AM IST

ETV Bharat / state

కుటుంబ నియంత్రణ కోసం వెళ్లి... మృతి చెందింది

కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ కోసం వెళ్లిన మహిళ వైద్యం వికటించి మృతి చెందిన ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

fail-of-treatment-women-dead-in-vikarabad
కుటుంబ నియంత్రణ కోసం వెళ్లి... మృతి చెందింది

వికారాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ కోసం వెళ్లిన మహిళ మృతి చెందింది. నవాబుపేట మండలం లింగంపల్లికి చెందిన ప్రసన్న రెండు రోజుల క్రితం ఆపరేషన్​ చేయించుకోవడం కోసం ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి వెళ్లింది.

ఆదివారం రోజున ఆపరేషన్​కి ముందు వైద్యులు ఇంజెక్షన్​ ఇచ్చారని దానితో కొద్దిసేపటికే ప్రసన్న మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టరు లేని సమయంలో నర్సు ఇంజెక్షన్​ ఇచ్చారని అది వికటించే ప్రసన్న మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు.

పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక ఇంజెక్షన్​ వల్లే మరణించినట్టు తేలితే వైద్యులపై కేసు నమోదు చేస్తామని పోలీసుల తెలిపారు.

కుటుంబ నియంత్రణ కోసం వెళ్లి... మృతి చెందింది
ఇదీచూడండి.'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

ABOUT THE AUTHOR

...view details