వికారాబాద్లో ఆర్టీసీ ధూంధాం
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ధూంధాం నిర్వహించారు. కళాకారులు ప్రభుత్వ తీరును ఎండగడుతూ పాటలు పాడారు. బ్రిటిష్ కాలంలోనే సమ్మె చేయడానికి కార్మికులకు హక్కు ఉందని, కోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రత్నం అన్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా... ధూంధాం కొనసాగించారు.