తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలనాధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించాలి: హరీశ్​రావు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

By

Published : Feb 27, 2021, 4:23 AM IST

Minister Harish Rao visited Sangareddy District Zaheerabad
'కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించాలి'

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో జరుగుతోన్న పలు అభివృద్ధి పనులను... ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పరిశీలించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పని తీరును పర్యవేక్షించవల్సిందిగా సూచించారు.

పట్టణంలో డ్రైన్ నిర్మాణం వల్ల ఉపాది కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో నూతన వైకుంఠధామాలు నిర్మించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.

ఇదీ చదవండి:'12 కోట్ల ఉద్యోగాల వివరాల కోసం వేచిచూస్తున్నా'

ABOUT THE AUTHOR

...view details