తెలంగాణ

telangana

By

Published : Mar 20, 2019, 11:19 PM IST

ETV Bharat / state

ప్రభుత్వాధికారినంటూ అడ్డగోలుగా దోచేశాడు, బుక్కయ్యాడు

ప్రభుత్వ అధికారిగా చెలామణి అవుతూ... నిరుద్యోగుల నుంచి వేల రూపాయలు కాజేస్తున్నాడో యువకుడు. తన మిత్రులంతా ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించి ఆనందమైన జీవితం గడుపుతున్నారని తాను కూడా వారిలా కొనసాగాలనే దుర్బుద్ధితో మోసాలకు పాల్పడి చివరకు కటకటాల పాలయ్యాడు.

ప్రభుత్వాధికారినంటూ దోచేస్తున్నాడు

ప్రభుత్వాధికారినంటూ దోచేస్తున్నాడు
నకిలీ ఐఎఫ్ఎస్ గుర్తింపు కార్డును సృష్టించుకొని నగరంలో ప్రభుత్వాధికారిగా చెప్పుకుంటూ డబ్బు కాజేసిన కుర్షిద్ అహ్మద్ దార్ చివరకు పోలీసులకు చిక్కాడు. జమ్మూ కశ్మీర్​కు చెందిన ఈ నిందితుడు గతంలో ఎంతో మందిని ఇలానే మోసం చేశాడు.

హైదరాబాద్​కు మకాం మార్పు

హైదరాబాద్​లో అయితే బాగా మోసం చేయవచ్చని కుర్షిద్ నగరానికి చేరుకున్నాడు. సిద్దార్ధ్ అనే వ్యక్తిని నమ్మించి 40వేలు దోచేశాడు. తనకు ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కుర్షిద్​ను అరెస్టు చేశారు. ఇతని వద్ద 40వేల రూపాయలు, కొరియా డాలర్లు, ఒక సెల్‌ఫోన్, నకిలీ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నామని సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ తెలిపారు.

ఇవీ చదవండి:తెరాసతో కుమ్మక్కైనకాంగ్రెస్​ నేతలు

ABOUT THE AUTHOR

...view details