మొహర్రం వేడుకల్లో పాల్గొన్న ఉత్తమ్ దంపతులు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో నిర్వహించిన మొహర్రం వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మతాలకు అతీతంగా మొహర్రం పండుగను జరుపుకోవాని ఆయన సూచించారు. పట్టణంలో మసీదుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.