మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉర్సు ఉత్సవాలను సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడు దర్గాలో ఘనంగా నిర్వహించారు.
'జాన్పాడు ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న హోంమంత్రి' - సూర్యాపేట జిల్లాలో జాన్పాడు దర్గా
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడు దర్గాలో ఉర్సు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు.
!['జాన్పాడు ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న హోంమంత్రి' ursu celebrations at janpahad dargah in suryapet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5826120-thumbnail-3x2-a.jpg)
'జాన్పాడు ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న హోంమంత్రి'
'జాన్పాడు ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న హోంమంత్రి'
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి సంప్రదాయబద్ధంగా గంధం తీసుకువచ్చి మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలోని హజ్రత్ సయ్యద్ మోహినీ షా సమాధులతో పాటు బయట ఉన్న సైనిక బృందాల సమాధులను గంధం, పూలతో అలంకరించారు.
జాన్పాడు దర్గాలో వచ్చే ఏడాది అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. రెండు మూడు నెలల్లో దర్గాకు మరోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
- ఇదీ చూడండి: హరిత హోటల్ను ప్రారంభించిన మంత్రులు