సమ్మెను ఉద్ధృతం చేసిన ఆర్టీసీ కార్మికులు - tsrtc_strike
కోదాడ ఆర్టీసీ డిపో వద్ద అఖిలపక్షం మద్దతుతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమ్మె నిర్వహించారు.
![సమ్మెను ఉద్ధృతం చేసిన ఆర్టీసీ కార్మికులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4710308-597-4710308-1570707295137.jpg)
సమ్మెను ఉద్ధృతం చేసిన ఆర్టీసీ కార్మికులు
సూర్యాపేట జిల్లా కోదాడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు 6వ రోజు సమ్మెను ఉద్ధృతం చేశారు. వీరికి అఖిల పక్షం నుంచి మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ కోదాడ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచారు. సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెరాస పాలనలో ప్రజలు సంతోషంగా లేరని అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
సమ్మెను ఉద్ధృతం చేసిన ఆర్టీసీ కార్మికులు