సీటు బెల్టు, హెల్మెట్ ధరించని ప్రయాణం ప్రమాదకరమని సూర్యాపేట జిల్లా ఇంఛార్జ్ రవాణా అధికారి సుభాష్ అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్రోడ్ వద్ద 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు.