ప్రజలందరూ 21 రోజుల లాక్డౌన్ను పాటించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల బలమైన దేశాలే ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. ఆర్థిక సాయం అందనివారికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్నా వైద్య, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ 21 రోజులు ఫేస్బుక్ లైవ్లో ఏదో ఒక సమయంలో ప్రజలతో మాట్లాడతానని ఉత్తమ్ వెల్లడించారు.
ఆర్థిక సాయానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఉత్తమ్ - తెలంగాణలో లాక్డౌన్ వార్తలు
ఆర్థిక సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ప్రజలందరూ 21 రోజుల జనతా కర్ఫ్యూని పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య, పోలీస్ శాఖలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆర్థిక సాయానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఉత్తమ్
TAGGED:
lock down in telangana state