సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఉత్తమ్ ఆరోపించారు. మొదట విడతలో మాఫీ చేస్తామని చెప్పిన 25 వేలు కూడా మాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. రైతు బంధు కూడా అందరికి రాలేదని ఉత్తమ్ అన్నారు.
సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ - suryapet district news
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు.
సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన నల్గొండ ఎంపీ ఉత్తమ్
గత 3 సంవత్సరాల నుంచి పత్తి కొనుగోలు తగ్గిందని.. పత్తి పంట వేయాలని చెబుతున్న ప్రభుత్వం.. కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలో పండిన వరిధాన్యంలో ఇప్పటివరకు సగం కూడా కొనుగోలు చేయలేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్ ఆరోపించారు.
ఇవీ చూడండి: మంత్రి జగదీశ్రెడ్డి వర్సెస్ ఉత్తమ్కుమార్రెడ్డి