100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్... పేపర్లోనే.. అమల్లోకాదు ఎస్సీ ఎస్టీ కాలనీలకు 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి చాలా రోజులైనా.... ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని తిలక్నగర్లో కరెంట్ బిల్లు కట్టలేదని విద్యుత్ నిలిపివేయగా... కాలనీవాసులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు ఉచిత విద్యుత్ను ప్రకటించినా... తమ ఇళ్లలో కరెంట్ నిలిపివేశారని అధికారులను నిలదీశారు.
తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, ఈ విషయంలో తాము ఎలాంటి సాయం చేయలేమని అధికారులు స్పష్టం చేశారు. ఆగ్రహం చెందిన తిలక్నగర్ కాలనీవాసులు హుజూర్నగర్లోని డీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం విద్యుత్శాఖ ఇంఛార్జికి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇవీచూడండి:'5 నిమిషాలు రైతుల గురించే చర్చించే సమయం దొరకలేదా..?'