తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించిన యువకులు

కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కుటుంబానికి పెద్దదిక్కు మృతి చెందితే.. వారిని ఖననం చేసేందుకు పిల్లలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులే ఎదురైన సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువకుడికి.. స్థానిక యువకులు అండగా నిలిచారు. మేమున్నామంటూ ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నారు.

By

Published : May 21, 2021, 2:44 PM IST

funeral for the corona dead body
funeral for the corona dead body

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ కొమరబండకు చెందిన రేషన్ డీలర్ చల్లా శివయ్య కరోనాతో మృతి చెందాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న మృతుడి కుమారుడు.. అంత్యక్రియలు నిర్వహించాలని గ్రామస్థులను.. కన్నీటితో చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నాడు. అయినా.. వైరస్​ భయంతో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.

మృతుడి కుమారుడి ఆవేదన చూసి చలించిన స్థానిక యువకులు.. అతనికి అండగా నిలిచారు. మేమున్నామంటూ ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నారు. దగ్గరుండి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆపత్కాలంలో ఆదుకున్న వారికి తమ కుటుంబం రుణపడి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:మొండిగా ఉంటేనే.. మహమ్మారిని ఎదుర్కోగలం : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details