తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లి మండపంలో ముష్టియుద్ధం - పెళ్లి మండపంలో లొల్లి

అప్పటివరకు నవదంపతులను ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులతో కళకళలాడిన పెళ్లి మండపం... సాయంత్రానికి కల్లా...  అమ్మాయి తరఫు బంధువులు, అబ్బాయి తరఫు బంధువులు ఒకరినినొకరు కుమ్ముకున్నారు. అసలేం జరిగిందంటే..?

The BRIBE's relatives and the The groom's relatives are Clash at suryapet district

By

Published : Nov 1, 2019, 11:32 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన అజయ్​కి... ప్రకాశం జిల్లాకు చెందిన ఇంద్రజకు రెండ్రోజుల క్రితం వివాహం జరిగింది. అనంతరం పెళ్లి కుమార్తె బంధువులు బరాత్​లో డీజే వద్దని... తాము త్వరగా వెళ్లాలని వరుడి బంధువులకు తెలిపారు. ఇంతలో మాటా మాటా పెరిగి ముష్టియుద్ధానికి దారితీసింది.

ఇరువర్గాల బంధువులు ఒకరినొకరు కొట్టుకున్నారు. కుర్చీలు ఎత్తి కొట్టుకున్నారు. యువకుల ఆవేశాన్ని చల్లార్చేందుకు బంధువర్గంలోని మహిళలు కాళికావతారం ఎత్తాల్సి వచ్చింది. చివరకు మహిళల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ముష్టియుద్ధం చేసిన వాళ్లు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఆవేశానికి పోయి నూతన వధూవరులను, ఇరు కుటుంబాలను ఇబ్బంది పెట్టారు.

ఇరు కుటుంబాలు ఈ ఘటన మర్చిపోవాలని శ్రేయోభిలాషులు కోరుతున్నారు. ముఖ్యంగా నూతన వధూవరులు సంఘటన గురించి ఆలోచించకుండా.. హాయిగా కలకాలం అన్యోన్యంగా కాపురం చేయాలని సూచిస్తున్నారు.

పెళ్లి ఇంట డీజే తెచ్చిన చిచ్చు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కెర్లు కొడుతుంది.

పెళ్లి మండపంలో ముష్టియుద్ధం

ఇదీ చదవండి: ఆర్టీసీ సంస్థకు కొత్త రూపు తెచ్చేందుకు సర్కారు సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details