తెలంగాణ

telangana

By

Published : May 10, 2021, 10:17 AM IST

Updated : May 10, 2021, 11:37 AM IST

ETV Bharat / state

ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు

covid
covid

10:16 May 10

ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు

ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు

రాష్ట్రంలో కొవిడ్‌ రెండో దశ విజృంభణతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న కొవిడ్‌ అంబులెన్స్‌లను రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. 

ఏపీలో విస్తృతంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున కొవిడ్‌ రోగులకు రాష్ట్రంలోకి అనుమతి లేదని.. మరోవైపు హైదరాబాద్‌లో పడకలు, ఆక్సిజన్‌ లేవని పోలీసులు చెబుతున్నారు. పుల్లూరు టోల్‌గేట్‌ వద్దకు కర్నూలు పోలీసులు చేరుకుని తెలంగాణ పోలీసులతో మాట్లాడారు. ఆస్పత్రుల హామీతో అంబులెన్స్‌లను తెలంగాణలోకి విడిచిపెడుతున్నారు. మిగతా వాహనాలను మాత్రం యథావిధిగా అనుమతిస్తున్నారు. 

Last Updated : May 10, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details