రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా(telangana formation day 2021) శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు క్లాక్ టవర్ కూడలి వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న నేతలు - సూర్యాపేట
నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక(telangana formation day 2021)ల్లో పాల్గొన్నారు.
ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న నేతలు
మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. గత ఏడేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని... నేతలు వివరించారు.
ఇదీ చుడండి : నూతన పరిపాలన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్బీఐ డిప్యూటీ ఎండీ