సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం అక్రమ దందాలకు అడ్డాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున మఠంపల్లి నుంచి హైదరాబాద్ తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
'అసలైన సూత్రధారులను వదిలేస్తున్నారు' - ration rice caught by suryapet police
లాక్డౌన్లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం పంపిణీ చేస్తోన్నరేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దోచేస్తున్నారు.
!['అసలైన సూత్రధారులను వదిలేస్తున్నారు' suryapet police caught ration rice while transporting to hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7218481-524-7218481-1589605336697.jpg)
సూర్యాపేట జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
సుమారు 165 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా గతంలో రేషన్, గుట్కా దందాల్లో పీడీ యాక్ట్ కింద కేసు నమోదైన ఓ వ్యక్తి నడిపిస్తున్నట్లు వెల్లడించారు.
ఓ రాజకీయ నేత అండదండలతోనే ఈ దందా నడుస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రతిసారి డ్రైవర్లు, కూలీల పైన కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని, సూత్రధారులను పట్టుకోవడం లేదని విమర్శిస్తున్నారు.