భారత్ బంద్కి మద్దతుగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిని తెరాస కార్యకర్తలు, రైతులు దిగ్బంధించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్లను అడ్డుగా నిలిపి నిరసన వ్యక్తం చేశారు.
జాతీయ రహదారి దిగ్బంధం.. నిలిచిపోయిన వాహనాలు - bharat bandh news
భారత్ బంద్లో భాగంగా సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిని తెరాస కార్యకర్తలు, రైతులు దిగ్బంధించారు. దీంతో కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
![జాతీయ రహదారి దిగ్బంధం.. నిలిచిపోయిన వాహనాలు suryapet national highway blocked due to bharat bandh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9805483-711-9805483-1607414922810.jpg)
జాతీయ రహదారి దిగ్బంధం.. నిలిచిపోయిన వాహనాలు
ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు కావడంతో రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. దీంతో కిలోమీటర్ల మేర లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి:రైతుల కష్టాన్ని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే కుట్ర: మంత్రి తలసాని