తెలంగాణ

telangana

కేసీఆర్‌ కిట్టు కోట్ల బకాయిలు

By

Published : Jul 27, 2019, 11:49 AM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు, మాత, శిశు మరణాలను తగ్గించటంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్టు ద్వారా అందించే ఆర్థికసాయం ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిలిచిపోయింది. ఈ సాయానికి వేలాదిమంది గర్భిణులు, బాలింతలు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు.

కేసీఆర్‌ కిట్టు కోట్ల బకాయిలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో జిల్లా ఆసుపత్రులున్నాయి. 8 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 5 ఏరియా ఆసుపత్రులున్నాయి. ఉమ్మడి జిల్లాలో 34,88,809 మంది జనాభా ఉంది. ఇందులో 17,29,037 మంది మహిళలున్నారు. ఇందులో అధికులు పేదలే. మహిళలు గర్భం దాల్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పేదలంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేసుకునేలా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం కేసీఆర్‌ కిట్టు పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకున్న మహిళ బిడ్డకు జన్మనిస్తే రూ.13వేలు, మగబిడ్డకు జన్మనిస్తే రూ.12వేల ఆర్థిక సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు.

తొలుత రెండుసార్లు వైద్య పరీక్షలు చేసుకుంటే రూ.3వేలు, ఆసుపత్రులో ప్రసవమైన తరువాత రూ.5 వేలు, లేదంటే రూ.4 వేలు ఇస్తారు. తొమ్మిది నెలల వరకు పెంటా వాలెంట్‌ సూదులు ఇప్పిస్తే రూ.2 వేలు, తట్టు (మీజిల్స్‌) టీకాలు ఇప్పిస్తే రూ.3 వేల ఆర్థ్ధికసాయాన్ని నేరుగా సంబంధిత మహిళా బ్యాంకు ఖాతాలో జమచేసేలా పథకాన్ని కొనసాగిస్తున్నారు.

ఏడాదిగా ఎదురుచూపులే
ఎమ్మెల్యేల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ఆగస్టు నుంచి ‘అమ్మఒడి-కేసీఆర్‌ కిట్టు’ చెల్లింపులు నిలిచిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతోపాటు జిల్లా కేంద్ర ఆసుపత్రులు, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకున్న వేల సంఖ్యలో గర్భిణులు, బాలింతలకు ఈ ఆర్థిక సాయం చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బుల కోసం లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలను ఆరా తీస్తున్నారు. కొందరు మహిళలు ప్రసవించి నెలలు దాటినా సాయం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఎంజీయూ సెమిస్టర్‌ ఫలితాల్లో పొరపాట్లు

ABOUT THE AUTHOR

...view details