తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా వరసిద్ధి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ - విగ్రహ ప్రతిష్ఠ

సూర్యాపేట జిల్లా కోదాడలో వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Statue of the idol celebrations in suryapet
వైభవంగా వరసిద్ధి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ

By

Published : Feb 13, 2020, 11:29 AM IST

వరసిద్ధి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని భవాని నగర్​లో ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, గర్తన్యాసం యంత్రస్థాపన, మహాయాగం, మహా పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను కొంకపాక రాధాకృష్ణమూర్తి వారి శిష్య బృందం నిర్వహించింది.

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దంపతులు విమాన కలశం ప్రతిష్ఠలో పాల్గొన్నారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా వరసిద్ధి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ

ఇదీ చూడండి: 56 ఏళ్లపాటు 'సహకార' ఛైర్మన్​.. ఇప్పుడు మళ్లీ...

ABOUT THE AUTHOR

...view details