తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలమర్రికి భక్తుల ప్రత్యేక పూజలు - pillalamarri temple

సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి ఆలయాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Shivaratri celebrations were held at the Pillalamarri temples in Suryapeta district
పిల్లలమర్రికి శివరాత్రి శోభ.. భక్తుల ప్రత్యేక పూజలు

By

Published : Mar 11, 2021, 11:37 AM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చారిత్రక పిల్లలమర్రి శివాలయాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. శివరాత్రి వేడుకలకు పిల్లలమర్రి ఎరకేశ్వర, నామేశ్వర ఆలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.

పిల్లలమర్రికి శివరాత్రి శోభ.. భక్తుల ప్రత్యేక పూజలు

వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఎరకేశ్వరాలయం, నామేశ్వరాలయలలో ముందుగా మూలవిరాట్​కు ప్రథమ అభిషేకం చేసి.. అనంతరం శివుడికి పంచామృతలతో అభిషేకాలు నిర్వహించారు.

ఇదీ చదవండి:భార్యపై అనుమానంతో కాలు, చెయ్యి నరికిన భర్త

ABOUT THE AUTHOR

...view details