తెలంగాణ

telangana

By

Published : Sep 17, 2020, 8:36 PM IST

ETV Bharat / state

స్కావెంజర్స్​ను కొనసాగించాలని.. సూర్యాపేట జిల్లాలో ఆందోళన

సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండల కేంద్రంలో స్కావెంజర్​ల జనరల్ బాడీ సమావేశం నెహ్రు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఎక్స్​రోడ్ వద్ద ఆందోళన చేపట్టారు.

Scavengers protest at suryapet district
స్కావెంజర్స్​ను కొనసాగించాలని.. సూర్యాపేట జిల్లాలో ఆందోళన

ప్రభుత్వ పాఠశాలలు స్కావెంజర్స్​ను తొలగించారదని... మెమో 2026ను రద్దు చేయాలని.. స్కావెంజర్స్​ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్​టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండల కేంద్రంలో స్కావెంజర్​ల జనరల్ బాడీ సమావేశం నెహ్రు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఎక్స్​రోడ్ వద్ద ఆందోళన చేపట్టారు.

గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 28,500 మంది కార్మికులు పని చేస్తున్నారని వీరందరికి పని బారెడు జీతము బెత్తెడు అన్న సామెత అయ్యిందని విమర్శించారు. కేవలం నెలకు 2 వేల నుంచి రెండున్నర వేలు మాత్రమే చెల్లిస్తున్నారని.. ఇది కనీస వేతనాల చెల్లింపు చట్టానికి వ్యతిరేకమైనదని అన్నారు. తక్షణమే మెమో 2026 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details