తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిసరాల పరిశుభ్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత' - pattana pragathi in suryapet

ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుమలగిరి మున్సిపల్​ ఛైర్​పర్సన్ రజిని రాజశేఖర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న పారిశుద్ధ్య వారోత్సవాల్లో పాల్గొన్నారు.

sanitation program as a part of urban progress at thirumalagiri municipality
తిరుమలగిరిలో చెత్త బుట్టల పంపిణీ

By

Published : Jun 6, 2020, 11:51 AM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించారు. 7, 11 వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పురపాలక ఛైర్​పర్సన్​ రజిని రాజశేఖర్ పరిశీలించారు. అనంతరం తడి, పొడి చెత్త బుట్టలను కాలనీవాసులకు అందజేశారు.

వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రజినీ రాజశేఖర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ కె.ఉమేష్ చారి, వైస్ ఛైర్మన్ ఎన్. రఘునందన్ రెడ్డి, కౌన్సిలర్లు వై.నరేష్, సరళ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details